గోడ కూలి నలుగురు చిన్నారులు మృత్యువాత | 4 children die in freak accident | Sakshi
Sakshi News home page

గోడ కూలి నలుగురు చిన్నారులు మృత్యువాత

Nov 17 2015 6:00 PM | Updated on Sep 3 2017 12:37 PM

భారీ వర్షాలు నలుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొన్నాయి. గోడకూలి నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు.

రాయచోటి (వైఎస్సార్ జిల్లా) : భారీ వర్షాలు నలుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొన్నాయి. గోడకూలి నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. వైఎస్సార్ జిల్లా సంబేపల్లి మండలం రౌతుకుంట గ్రామం శివారు బోయపల్లిలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో నలుగురు చిన్నారులు ఆడుకుంటుండగా హఠాత్తుగా స్లాబ్ కూలి వారిపై పడింది. దీంతో నలుగురూ మృత్యువాతపడ్డారు. జేసీబీ సాయంతో శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement