Today Corona Cases in AP: 1908 New Positive Cases are Registered in Andhra Pradesh - Sakshi Telugu
Sakshi News home page

ఏపీలో మరో 1908 కరోనా కేసులు..

Jul 14 2020 2:36 PM | Updated on Jul 14 2020 3:25 PM

1908 New Corona Positive Cases Reported In Andhra Pradesh - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,908 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,908 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 33,019కి చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్‌ నుంచి కోలుకుని 952 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 17,467 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి అనంతపురంలో పది మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది మంది, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కడపలో ఐదుగురు, కర్నూలులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు.. మొత్తం 43 మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 408 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 22,670 శాంపిల్స్‌ను పరీక్షించగా, ఇప్పటివరకు ఏపీలో 11,95,766 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,144 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement