బస్సు బోల్తా: 18 మంది విద్యార్థులకు గాయాలు | 18 students in jured in bus accident | Sakshi
Sakshi News home page

బస్సు బోల్తా: 18 మంది విద్యార్థులకు గాయాలు

Aug 25 2015 9:47 AM | Updated on Sep 3 2017 8:07 AM

ఓ కళాశాల బస్సు బోల్తా పడిన ఘటనలో 18 మంది విద్యార్థులు గాయపడ్డారు.

ఉంగటూరు: ఓ కళాశాల బస్సు బోల్తా పడిన ఘటనలో 18 మంది విద్యార్థులు గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు మండలం కాకర్లమూడి వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడేనికి చెందిన యూకే కళాశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో 18 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ కారణమని విద్యార్థులు తెలిపారు. కాగా, డ్రైవర్ పరారయ్యాడు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement