విశాఖ జిల్లా రోలుగుంటలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖపట్టణం : విశాఖ జిల్లా రోలుగుంటలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రోలుగుంట సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం వాహన తనిఖీనలు నిర్వహించారు. అదే సమయంలో బీబీపట్నం వైపు నుంచి బైక్పై వచ్చిన ఒక వ్యక్తిని సోదా చేయగా 12 కిలోల గంజాయి లభ్యమైంది. అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన కర్పూరపు వరప్రసాద్ అని తెలిసింది.
(రోలుగుంట)