ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు | 10 injured in road accident | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Sep 12 2015 5:03 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లటంతో 10 మందికి గాయాలయ్యాయి.

ఉంగుటూరు (పశ్చిమగోదావరి) : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లటంతో 10 మందికి గాయాలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం వాచూరు వద్ద శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన బస్సు 20 మంది ప్రయాణికులతో భీమవరం నుంచి వెళ్తోంది.

కాగా వాచూరు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని 10 మంది గాయాలపాలయ్యారు. ఇంట్లో ఉన్న వారు అప్రమత్తమై పక్కకు తప్పుకోవటంతో ఎవరికీ ప్రమాదం జరుగలేదు. క్షతగాత్రులను ఉంగుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement