మద్యం మత్తులో నిప్పంటించుకున్న వ్యక్తి | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో నిప్పంటించుకున్న వ్యక్తి

Sep 7 2026 2:50 AM | Updated on Sep 7 2026 2:50 AM

మైదుకూరు : మున్సిపాలిటీ పరిధిలోని గడ్డం వారి పల్లెలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో హజరత్‌ ( 55 ) అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. గ్రామంలోని బీసీ కాలనీలో ఒంటరిగా ఉంటున్న హజరత్‌ ఇంట్లో నుంచి మంటలు కనిపించేసరికి చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పి, 108 అంబులెన్స్‌ కు సమాచారం అందించారు. తాను ఆసుపత్రికి రానని హజరత్‌ కొంతసేపు బెట్టు చేశాడు. రాత్రి 9.40 ప్రాంతంలో ఇరుగుపొరుగువారు అతన్ని అంబులెన్స్‌ ఎక్కించగా చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా సంఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement