కడప రిమ్స్‌ ప్రిన్సిపాల్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

కడప రిమ్స్‌ ప్రిన్సిపాల్‌ బదిలీ

May 7 2025 1:31 AM | Updated on May 7 2025 1:31 AM

కడప ర

కడప రిమ్స్‌ ప్రిన్సిపాల్‌ బదిలీ

కడప అర్బన్‌: ప్రభుత్వ సర్వజన వైద్యకళాశాల (రిమ్స్‌) ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఏ.సురేఖ నంద్యాల ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు. 2022 అక్టోబర్‌లో పూర్తి అదనపు బాధ్యతలతో రిమ్స్‌ ప్రిన్సిపాల్‌గా విధుల్లో చేరిన డాక్టర్‌ సురేఖ 2023 సెప్టెంబర్‌ నుంచి అడిషనల్‌ డీఎంఈ హోదాలో ప్రిన్సిపాల్‌గా సమర్థవంతంగా విధులను నిర్వహించారు. ఆమె స్థానంలో ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా, అడిషనల్‌ డీఎంఈ హోదాలో పనిచేస్తున్న డాక్టర్‌ టి.జమున కడప ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు.

పౌర రక్షణకు పటిష్ట భద్రతా చర్యలు

కడప సెవెన్‌రోడ్స్‌/ అర్బన్‌: సివిల్‌ డిఫెన్స్‌ రూల్స్‌ –1968 లోని సెక్షన్‌ 19 కింద భారత ప్రభుత్వం నిర్దేశించిన జిల్లాల్లో పౌర రక్షణ మాక్‌ డ్రిల్‌, రిహార్సల్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని...ఈ మేరకు ఉత్తర్వులు అందాయని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మాక్‌ డ్రిల్‌ నిర్వహణ జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రణాళిక ప్రకారం నిర్వ హించాల్సిన అవసరం ఉందన్నారు. సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్‌ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, వివిధ జిల్లా అధికారులు, సివిల్‌ డిఫె న్స్‌ వార్డెన్లు, వలంటీర్లు, హోమ్‌ గార్డ్‌ (యాక్టివ్‌/రిజర్వ్‌ వాలంటీర్లు), ఎన్‌సీసీ కళాశాల, పాఠశాల విద్యార్థుల చురుకుగా పాల్గొనాలన్నారు. ఈ మాక్‌ డ్రిల్‌ నిర్వహణతో దేశం చేపట్టే పౌర రక్షణ చర్యల కార్యాచరణ, సమర్థ త, సమన్వయాన్ని అంచనా వేయనున్నట్లు పేర్కొన్నారు.

హుండీ ఆదాయం లెక్కింపు

వల్లూరు: పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారి హుండీల ఆదాయాన్ని లెక్కించారు. పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు సమర్పించుకున్న కానుకలను కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో దేవదా య శాఖ అధికారుల సమక్షంలో లెక్కించారు. శాశ్వత హుండీల ద్వారా రూ.6,11,462 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాసులు తెలిపారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా సేవా టికెట్ల ద్వారా రూ.69,750లు, అన్న దా నం కోసం ఇచ్చిన చందాల ద్వారా రూ 78,285 వచ్చిందని, దీంతో మొత్తం కలిపి రూ 7,59,762 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. జిల్లా దేవదాయ శాఖ కమీషనర్‌ జీ మల్లికార్జున, అనువంశిక ధర్మకర్త దుగ్గిరెడ్డి వెంకట సుబ్బా రెడ్డి, ఆలయ అర్చకులు అఖిల్‌ దీక్షితులు భక్తులు పాల్గొన్నారు.

మదనపల్లెలో

సీఐడీ అధికారులు

మదనపల్లె: మండల తహసీల్దార్‌ కార్యాలయానికి మంగళవారం సీఐడీ అధికారులు వచ్చారు. మదనపల్లె ఫైల్స్‌ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన సీఐడీ డీఎస్పీ పద్మలత... తహసీల్దార్‌ అందుబాటులో లేకపోవడంతో ఆర్‌ఐ భరత్‌తో మాట్లాడారు. వలసపల్లె పంచాయతీలో ఫ్రీహోల్డ్‌ భూములకు సంబంధించి వివరాలు కోరితే.. ఇప్పటి వరకు ఇవ్వకపోవడంపై ప్రశ్నించారు. అలాగే ఇతర రిపోర్ట్‌లు ఆలస్యం చేస్తున్నారని, కేసు దర్యాప్తులో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. ఫ్రీ హోల్డ్‌ భూములకు సంబంధించి వివరాలు ఇవ్వడంతో పాటు లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తు పత్రాలను ఇవ్వాల్సిందిగా కోరారు.

గాలివాన బీభత్సం

ఓబులవారిపల్లె: మండలంలో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. మండల వ్యాప్తంగా సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో వాన పడింది. వర్షానికి తోడు విపరీతంగా గాలులు తోడు అయ్యాయి. దీంతో కాకర్లవారిపల్లి, బోటిమీదపల్లి, రాళ్ల చెరువుపల్లి తదితర గ్రామాల్లో బొప్పాయి, అరటి చెట్లు నేలకొరిగాయి. వందలాది ఎకరాలలో పంట నష్టం వాటిల్లింది. పంట చేతికందే సమయంలో గాలులకు నేలకు ఒరగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అంతంత మాత్రాన ఉన్న మామిడి కాయలు గాలులకు రాలిపోయాయి.

కడప రిమ్స్‌ ప్రిన్సిపాల్‌ బదిలీ 1
1/2

కడప రిమ్స్‌ ప్రిన్సిపాల్‌ బదిలీ

కడప రిమ్స్‌ ప్రిన్సిపాల్‌ బదిలీ 2
2/2

కడప రిమ్స్‌ ప్రిన్సిపాల్‌ బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement