
11న అరుణాచలానికి ప్రత్యేక సర్వీసులు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే వారి కోసం మే 11వ తేదీన ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు.
● కడప డిపో నుంచి ఉదయం 6 గంటలకు గోల్డెన్ టెంపుల్ మీదుగా, రాత్రి 9 గంటలకు రాయచోటి, చిత్తూరు, వేలూరు మీదుగా బస్సులు బయలుదేరుతుందన్నారు. ఇందులో టిక్కెట్ ధర రూ. 1044 గా ఉందన్నారు.
● బద్వేలు డిపో నుంచి ఉదయం 9.00 గంటలకు కడప, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అల్ట్రా డీలక్స్ బస్సు బయలుదేరుతుందన్నారు. ఇందులో చార్జి రూ. 1282లు.
● మైదుకూరు డిపో నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కడప, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా సూపర్లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. ఇందులో రూ. 1209 చార్జీగా నిర్ణయించారు.
● ప్రొద్దుటూరు డిపో నుంచి సాయంత్రం 6 గంటలకు మైదుకూరు, కడప మీదుగా సూపర్లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. ఇందులో టిక్కెట్ ధర రూ. 1273లు.
● పులివెందుల డిపో నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు రాయచోటి, పీలేరు మీదుగా నడుస్తుందన్నారు. ఇందులో చార్జీ రూ. 1242గా ఉందన్నారు.
● జమ్మలమడుగు డిపో నుంచి రెండు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరి వెళుతాయన్నారు. ఒక బస్సు సాయంత్రం 6.00 గంటలకు మరో బస్సు రాత్రి 8.00 గంటలకు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప మీదుగా నడుస్తుందన్నారు. ఇందులో ఛార్జీగా రూ. 1363 చొప్పున నిర్ణయించారని తెలిపారు.