మట్టి టిప్పర్‌ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

మట్టి టిప్పర్‌ పట్టివేత

Apr 29 2025 7:11 AM | Updated on Apr 29 2025 7:11 AM

మట్టి టిప్పర్‌ పట్టివేత

మట్టి టిప్పర్‌ పట్టివేత

పెండ్లిమర్రి : మండలంలోని వెల్లటూరు గ్రామ సమీపంలోని ఎగువ చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న ఒక టిప్పర్‌ను సోమవారం ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన టిప్పర్‌ను రెవెన్యూ అధికారులకు అప్పగించారు.

గడ్డివామి, పూరిగుడిసె దగ్ధం

బద్వేలు అర్బన్‌ : బద్వేలు అగ్నిమాపక కేంద్రం పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం ప్రమాదవశాత్తు గడ్డివామి, పూరిగుడిసె దగ్ధమైనట్లు ఫైర్‌ ఆఫీసర్‌ ఎం.చంద్రుడు తెలిపారు. పట్టణంలోని నెల్లూరు రోడ్డులో గల శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ గోశాలకు సంబంధించిన గడ్డివామి ప్రమాదవశాత్తు దగ్ధమవడంతో రూ.50 వేలు నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. అలాగే గోపవరం మండలం రాచాయపేట గ్రామంలో స్వర్ణకొండయ్యకు చెందిన పూరిగుడిసె ప్రమాదవశాత్తు దగ్ధమైనట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనలో రూ.40 వేలు నష్టం వాటిల్లిందన్నారు.

ఉపాఽధి కూలీలపై తేనెటీగల దాడి

రాజుపాళెం : మండలంలోని సోమాపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న దాదాపు 25 మంది ఉపాధి కూలీలపై సోమవారం తేనెటీగలు దాడి చేశాయి. గ్రామ సమీపంలోని వంకలో జమ్ము కోసే క్రమంలో తేనెటీగలు అక్కడ ఉండటంతో ఒక్క సారిగా వారిపై దాడి చేశాయి. మొత్తం 150 మంది కూలీలు అక్కడ పని చేస్తుండగా ఒక్క సారిగా తేనెటీగలు వచ్చి వారిపై దాడి చేయడంతో భయపడిన కూలీలు పరుగులు తీస్తూ కిందా మీద పడి గ్రామంలోకి చేరుకున్నారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారంతా రాజుపాళెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందారు. ఈ విషయాన్ని ఏపీఓ లక్ష్మీనారాయణ దృష్టికి కూలీలు తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement