యువ పరిశోధకులకు విస్తృత అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

యువ పరిశోధకులకు విస్తృత అవకాశాలు

Mar 21 2025 1:00 AM | Updated on Mar 21 2025 12:56 AM

కడప ఎడ్యుకేషన్‌ : యువ పరిశోధకులకు శాస్త్ర పరిశోధనలో విస్తృత అవకాశాలున్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఎఫ్‌ఎన్‌ఎ ఫెలో ఆఫ్‌ నేషనల్‌ అకాడమీ ఆచార్య ఏఎస్‌.రాఘవేంద్ర స్పష్టం చేశారు. వైవీయూలోని తాళ్లపాక అన్నమాచార్య సమావేశ మందిరంలో ‘జీవశాస్త్రంలో కమ్యూనికేషన్‌ వ్యవస్థలు’ అంశంపై గురువారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర మాట్లాడుతూ సైంటిఫిక్‌ లెక్చర్స్‌పై స్కాలర్లు దష్టి సారిస్తే సైన్స్‌ అకాడమీలు సహకారం అందిస్తాయన్నారు. ప్రిన్సిపల్‌ రఘునాథరెడ్డి మాట్లాడుతూ వివిధ జాతుల మధ్య పర్యావరణ సమతుల్యత నిర్వహించడంలో కమ్యూనికేషన్‌ సహాయ పడుతుందన్నారు. ఆచార్య పి.పద్మ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం–2020 కింద ఇంటర్‌ డిసిప్లినరీ పరిశోధనలను ప్రోత్సహిస్తున్నారని, వ్యాధుల నిర్ధారణ, చికిత్స, ఔషధం అభివద్ధి, వ్యవసాయం, పర్యావరణ స్థిరత్వం అంశాలలో సహాయపడతారని తెలిపారు. అనంతరం అతిథులు పలు అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ ఎస్‌.రాజగోపాల్‌, ఆచార్య ఎస్‌.నరేష్‌బాబు, ఆచార్య డాక్టర్‌ దయానంద్‌, ప్రొఫెసర్‌ రియాజున్నీసా, ప్రొఫెసర్‌ మాదక్క, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement