నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వై. ప్రశాంతి యూనివర్సిటీలో వివిధ రకాల ప్రాజెక్టులు రూపొందించి విద్యార్థుల విద్యాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాలు, పబ్లికేషన్స్, సోషల్ సర్వీస్ చేయడం ద్వారా ఆమెకు ఉత్తమ అవార్డు రావడానికి దోహదపడ్డాయి. యూనివర్సిటీలో ఉద్యోగాల కల్పన కోసం కూడా ఆమె వివిధ కంపెనీలతో మాట్లాడి చొరవ తీసుకోవడంతో ఎంతోమంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి.
వై. ప్రశాంతి, అసోసియేట్ ప్రొఫెసర్, ఎంజీయూ


