ఎయిమ్స్లో ఎలక్ట్రిక్ ఆటోలు
భువనగిరిటౌన్ : బీబీనగర్ ఎయిమ్స్లో వైద్య సేవలు పొందేందుకు వచ్చే రోగులను స్థానిక బస్టాండ్ నుంచి ఆస్పత్రికి వరకు తీసుకెళ్లేందుకు ఆస్పత్రి నిర్వాహకులు రెండు ఎలక్ట్రిక్ ఆటోలు ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు ఆరుగురు ప్రయాణించేందుకు వీలుగా ఉంది. వృద్ధులు, గర్భిణులు, నడవలేని వారు ఈ ఆటోల్లో ఉచితంగా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇంటికి వెళ్లే రోగులను తిరిగి బస్టాండ్ వద్ద దింపుతున్నారు. సుమారు. రూ.3.5లక్షల విలువ చేసే ఈ ఆటోలు మరో నాలుగు రానున్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు.


