
నిస్సహాయులుగా గీత కార్మికులు
బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా మంజూరైనా చేతికిరాని చెక్కులు
రూ.2.77 కోట్లు రావాలి
జిల్లాలో తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందిన, గాయపడిన గీత కార్మికులకు ఎక్స్గ్రేషి యా రూ. 2.77 కోట్లు రా వాల్సి ఉంది. పరిహా రం మంజూరైనా బాధితుల చేతికి అందలేదు. అధికారులను సంప్రదిస్తే బడ్జెట్ లేదని చెబుతున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని, ఉన్నతాధికారులను కలిసి విన్నవించాం. బాధితులకు ఎక్స్గ్రేషియా డబ్బులు ఇవ్వనట్లయితే అందోళన కార్యక్రమాలు చేపడుతాం.
–బోలగాని జయరాములు,
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
బడ్జెట్ లేకపోవడంతో ఆలస్యం
గీత కార్మికుల ఎక్స్గ్రేషియా మంజూరైంది వాస్తవమే. బడ్జెట్ లేకపోవడంతో చెక్కులు అందచేయలేకపోయాం. జిల్లాలో 79 మంది బాధితులున్నారు. ప్రస్తుతం ముగ్గురికి రూ.5 లక్షల చొప్పున, ఇద్దరికి రూ.10 వేల చొప్పున చెక్కులు అందజేస్తాం. మూడు నెలలకు ఒకసారి బడ్జెట్ వస్తుంది. వచ్చె నెల అందరికీ చెక్కులు ఇవ్వడానికి సిద్ధం చేశాం. బడ్జెట్ వస్తేనే అందజేస్తాం.
–విష్ణుమూర్తి, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్
ఆత్మకూరు(ఎం) మండలం తుర్కల రేపాకకు చెందిన మూల ఆదినారాయణగౌడ్ వృత్తిలో భాగంగా 2023 నవంబర్ 3న కల్లు తీసేందుకు తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందడ్డాడు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతకుముందు ఏడాది క్రితం అతని భార్య శోభ అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు. రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా నిధులు మంజూరైనా చేతికి చెక్కు రాలేదు.
మోదుబావిగూడేనికి చెందిన వంగాల రమేష్ 20 ఏళ్లకు పైగా గీత వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. 2017లో భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. ఇద్దరి వివాహం అయింది. వృత్తిలో భాగంగా 2023 నవంబర్ 28న కల్లు తీయడానికి తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. చికిత్స నిమిత్తం రూ.10లక్షల వరకు ఖర్చు చేశాడు. కొంత అప్పు తెచ్చాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో బంగారు నగలు కూడా అమ్మాడు. కుటుంబం గడవడం కోసం చిరువ్యాపారం నిర్వహిస్తున్నాడు. రూ. 5లక్షల ఎక్స్గ్రేషియా మంజూరైనా చేతికి రాలేదని రమేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఆత్మకూరు(ఎం) : తాటిచెట్లపై నుంచి పడి మృతిచెందిన, గాయపడి వైకల్యం చెందిన గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వృత్తినే జీవనాధారంగా చేసుకుని బతుకును వెళ్లదీస్తున్న గీత కార్మికులు ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో తీవ్ర గాయాలతో వృత్తిని కొనసాగించలేకపోతున్నారు. కుటుంబ పెద్ద మరణించడం, గాయపడి మంచం పట్టడంతో ఆ కుటుంబం ఉపాధి కోల్పోతుంది. ఇటువంటి సందర్భాల్లో గీత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎకై ్సజ్శాఖ ద్వారా ఎక్స్గ్రేషియా అందజేస్తుంది. కానీ, జిల్లాలో రెండేళ్లుగా ఎక్స్గ్రేషియా అందక బాధిత కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
మృతులు, గాయపడిన కార్మికులు..
జిల్లాలో 14,262 మంది గీత కార్మికులు ఉన్నారు. వృత్తిలో భాగంగా గడిచిన రెండేళ్లలో 13 మంది చనిపోయారు. 42 మంది శాశ్వత, 24 మంది తాత్కాలిక వైకల్యం చెందారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.5 లక్షలు, శాశ్వత వైకల్యం చెందితే రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా, తాత్కాలిక అంగవైకల్యం చెంది వానికి ప్రభుత్వ రూ.10వేలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తుంది. రూ. 2.77 కోట్లు మంజూరైనా బాధిత కుటుంబాలకు అందలేదు. గీతకార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా, సీఎం రేవంత్రెడ్డికి, ఉన్నతాధికారులకు విన్నపాలు అందజేసినా ఫలితం లేకపోయింది.

నిస్సహాయులుగా గీత కార్మికులు

నిస్సహాయులుగా గీత కార్మికులు

నిస్సహాయులుగా గీత కార్మికులు

నిస్సహాయులుగా గీత కార్మికులు

నిస్సహాయులుగా గీత కార్మికులు