
భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి
సంస్థాన్ నారాయణపురం : రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్ ద్వారా భూ సమస్యలు తీరనున్నాయని మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. సోమవారం సంస్థాన్నారాయణపురంలో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తన కుంటుంబసభ్యుల కొసం ధరణి చట్టం తీసుకొస్తే, పేద రైతుల భూములు పోవద్దని, భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగొద్దనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. రాచకొండ ప్రాంతంలో ఎన్నో రకాల భూ సమస్యలు ఉన్నాయన్నారు.గతంలో ఇక్కడ పనిచేసిన ఆధికారులు జలగల్లా రైతులను పీక్కుతున్నారని, అవినీతికి తావుండరాదన్నారు. శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మండలాలను సస్యశ్యామలం చేస్తానన్నారు. కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని 33 ముక్కలుగా విభజించాని విమర్శించారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రాచకొండలో ప్రభుత్వ భూములు ఆక్రమించి వెంచర్లు చేస్తున్నారని అరో పించారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ మే 1నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఎమ్మెల్యే అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీని వాస్రెడ్డి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, మాజీ ఎంపీపీలు గుత్త ఉమాదేవిప్రేమ్చందర్రెడ్డి, బుజ్జి, ప్రభాకర్రెడ్డి, మార్కెట్ డైరక్టర్లు లోడే రఘు, మెగావత్ బిచ్చానాయక్, బచ్చనగోని గాలయ్య, గౌసొద్దిన్ ఖురేషి తదితరలు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి