
ట్యాంకరొస్తేనే గొంతు తడిచేది!
చౌటుప్పల్ : పట్టణంలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. డిమాండ్కు అనుగుణంగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం, మరో వైపు ఎండలకు మంచినీటి పథకాలు అడుగంటడంతో పరిస్థితి దయనీయంగా మారింది. మున్సిపల్ యంత్రాంగం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నా పూర్తిస్థాయిలో సమస్య తీర్చలేకపోతోంది.
భగీరథ నీళ్లు సగం లోపే..
రోజురోజుకూ పట్టణ విస్తరణతో పాటు జనాభా పె రుగుతోంది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు, 31,202 మంది జనాభా ఉంది. రోజుకు 6.5 ఎంఎల్డీల (65లక్షల లీటర్లు) నీరు అవసరం. ప్రస్తుతం కేవలం 2.5 ఎంఎల్డీల(25లక్షల లీటర్లు) నీళ్లు మాత్రమే వస్తున్నాయి. పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగకపోవడంతో ఉన్నంతలో పొదుపుగా వార్డులకు పంపిణీ చేస్తున్నారు. స్థానిక బోర్లనుంచి అరకొరగా వస్తున్న నీటితో కలిసి వంతుల వారీగా సరఫరా చేస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో సమస్య తీవ్రం
ప్రధానంగా 09,16,17,18,20వ వార్డు పరిధిలోని బంగారిగడ్డ, హనుమాన్నగర్, రత్నానగర్, సుందరయ్యకాలనీ, అంజనసాయి మెడోస్, బస్టాండ్ ఏరి యాతో పాటు మరికొన్ని కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గతంలో మేనెలలో ఎద్దడి ఏర్పడగా ..ఈసారి ఫిబ్రవరిలోనే మొదలైంది.
రోజుకు రూ.1200 వెచ్చిస్తున్నాం
గతంలో మే నెలలో తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచే నీటి కష్టాలు వచ్చాయి. మా హోట ల్కు మూడు నెలలుగా మున్సిపాలిటీ నల్లా నీరు నిలిచిపోయింది. మా సొంత బోరు కూడా ఎండిపోయింది. దీంతో రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నాం. ఇందుకోసం రోజుకు రూ.1200 వరకు ఖర్చు చేస్తున్నాం. హోటళ్లకు కూడా ఎంతోకొంత మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఆదుకోవాలి.
–గోపాలకృష్ణ శెట్టి, ప్రసాద్ ఉడిపి హోటల్ నిర్వాహకుడు, చౌటుప్పల్
చౌటుప్పల్లో తాగునీటికి కటకట
ఫ డిమాండ్కు అనుగుణంగా అందని మిషన్ భగీరథ నీళ్లు
ఫ ఎండలకు అడుగంటిన స్కీం బోర్లు
ఫ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
ఫ సరిపోక ప్రైవేట్గా కొనుగోలు చేస్తున్న జనం

ట్యాంకరొస్తేనే గొంతు తడిచేది!