
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష
గుండాల : రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం గుండాల మండల కేంద్రంలోని నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. అమలుకు సాధ్యంకాని 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంతో ఉన్నారని, కాంగ్రెస్ పాలనలో గోస పడుతున్నారని పేర్కొన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఏ ఒక్కరు అధైర్యపడవద్దన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నీళ్ల అయిలయ్య కాదు.. భూ కబ్జాల అయిలయ్య అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు ఎండీ ఖలీల్, నాయకులు ఎం.రామకృష్ణారెడ్డి, ఎం.బాల్రెడ్డి, మహేందర్రెడ్డి, రాములు, జి.శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్, అట్ల రంజిత్రెడ్డి, రాజు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత