
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
ఆలేరురూరల్ : మండలంలోని కొలనుపాక చర్చిలో ఈస్టర్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు ఏసుక్రీస్తును ఆరాదిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల్లో ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొ ని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. మరణాన్ని జయించి తిరిగి సజీవుడైన దేవుడు ఏసుక్రీస్తు అని పేర్కొన్నారు. యుగయుగాలకు ఏసయ్య సజీవుడై ఉంటాడన్నారు. క్రీస్తు సమాధిలోనుంచి లేచివచ్చిన శుభవేళ ఈస్టర్ పండుగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, నాయకులు వెంకటేశ్వరరాజు, నీలం పద్మ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.