
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
మోటకొండూర్: కాంగ్రెస్ ప్రభుత్వం అనతికాలంలోనే ప్రజావ్యతిరేకత మూటగట్టుకుందని, రానున్నది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. శనివారం మోటకొండూరులో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆచరణకు సాధ్యంకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. సబ్బండ వర్గాలకు ఇచ్చిన 420 హామీల్లో ఏఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది న్నరకాలంలోనే రాష్ట్రంలో 500 మంది రైతులు, 80 మంది నేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, అనేక మంది గీతకార్మికులు తాటిచెట్ల పైనుంచి పడి మృతిచెందారని, వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే భూకబ్జాలకు పాల్పడుతూ పోలీస్ స్టేషన్లను పార్టీ కార్యాలయాలుగా మార్చారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డిపై ప్రజల్లో నమ్మకం పో యిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఆలేరు నియోజకవర్గ ప్రజలతో జనసంద్రం కావాలని, అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు బొట్ల యాదయ్య, లింగాల శ్రీకర్రెడ్డి, ప ల్లా వెంకట్రెడ్డి, దూదిపాల రవీందర్రెడ్డి, నాయిని రామచంద్రారెడ్డి, బాల్ద లింగం, బీస కృష్ణంరాజు, పన్నాల నవీన్రెడ్డి, చామకూర అమరేందర్రెడ్డి, భూమండ్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ రజతోత్సవ సభతో సత్తా చాటుదాం
ఫ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత