మామిడికాయలు అమ్ముకొని ఇంటికి వెళ్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

మామిడికాయలు అమ్ముకొని ఇంటికి వెళ్తుండగా..

Apr 20 2025 1:53 AM | Updated on Apr 20 2025 1:53 AM

మామిడికాయలు అమ్ముకొని ఇంటికి వెళ్తుండగా..

మామిడికాయలు అమ్ముకొని ఇంటికి వెళ్తుండగా..

కోదాడరూరల్‌: మార్కెట్‌లో మామిడికాయలు అమ్ముకొని తిరిగి ట్రాక్టర్‌పై ఇంటికి వెళ్తుండగా.. లారీ ఢీకొనడంతో తండ్రి మృతిచెందాడు. కుమారుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ శివారులో శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం కోదాడ రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామానికి చెందిన రైతు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నేరళ్ల సైదులు(57) తన కుమారుడు సాయితో కలిసి శుక్రవారం ట్రాక్టర్‌లో మామిడికాయలను లోడ్‌ చేసుకుని సూర్యాపేట మార్కెట్‌లో అమ్ముకొని రాత్రి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ శివారులో వై–జంక్షన్‌ వద్దకు రాగానే ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌ పల్టీ కొట్టడంతో సైదులుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా.. అతడి కుమారుడు సాయి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతుడి కుమారుడు సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌రెడ్డి తెలిపారు.

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ

తండ్రి మృతి.. కుమారుడికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement