శ్రీవారి ఆలయానికి రూ.5 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయానికి రూ.5 లక్షల విరాళం

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

శ్రీవారి ఆలయానికి రూ.5 లక్షల విరాళం త్రుటిలో తప్పిన ప్రమాదం

కాళ్ల : కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులకు భక్తులు విరాళం అందించినట్లు దేవస్థానం చైర్మన్‌ అడ్డాల శివరామరాజు శుక్రవారం తెలిపారు. కలవపూడికి చెందిన నల్లపురాజు చిన్నకృష్ణంరాజు, అచ్యుతాయమ్మ దంపతుల కుమారుడు నీలాద్రిరాజు, సౌజన్యలక్ష్మి దంపతులు దక్షిణం వైపు కేశఖండన శాల పక్కన భవనం నిర్మాణానికి రూ.5,01,116 అందించారన్నారు.

నూజివీడు: లారీకి బ్రేకులు ఫెయిల్‌ అయిన నేపథ్యంలో ట్రిపుల్‌ఐటీలో శుక్రవారం పెనుప్రమాదం తప్పింది. మెస్‌లకు బియ్యం లోడుతో ఉదయం 6.30 గంటల సమయంలో క్యాంపస్‌లోకి వచ్చిన లారీకి బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. దీంతో లారీ ఐ–3 భవనానికి, మెస్‌కు మధ్య ఉన్న రోడ్డులో ఐ–2, ఐ–1 భవనాల మధ్య వెళ్లి ప్రహరీగోడను ఢీకొట్టి ఆగింది. లారీ ఢీకొట్టడంతో గోడ పడిపోయింది. ఇదే సంఘటన విద్యార్థులు వెళ్లే సమయంలో జరిగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement