తాడేపల్లిగూడెం: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో మిశ్రమ వ్యవసాయ విధానం ఎంతో అవసరమని ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. శనివారం సింగరాజుపా లెం వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించిన శాస్త్రవేత్తలు, వాతావరణ మా ర్పుల వల్ల కలిగే నష్టాలను అధిగమించడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, నేల సారవంతం, తేమ సంరక్షణపై అవగాహన కల్పించారు. డ్రమ్ సీడర్తో నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుందని వారు తెలిపారు. రిజిస్ట్రార్ ఎం. మాధవి, విస్తరణ సంచాలకులు సి.హెచ్. రూత్, పరిశోధన సంచాలకులు ఎస్. సూర్యకుమారి పాల్గొన్నారు.


