కేజీబీవీల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లాలోని కుకునూరు, వేలేరులోని కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్టు సమగ్రశిక్ష ఏలూరు జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కె.పంకజ్కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. కుకునూరులో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, వేలేరులో ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయని, సంబంధిత మండలాలకు చెందిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఏలూరులోని తన కార్యాలయంలో సమర్పించాలని సూచించా రు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా ఎంపిక నిర్వహిస్తారని తెలిపారు.


