నయీంనగర్: ‘కుడా’ చైర్పర్సన్గా గుండు సుధారాణి శనివారం హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో శనివారం బాధ్యతలు చేపట్టారు. వరంగల్ పశ్చిమ, ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, హనుమకొండ కలెక్టర్, ‘కుడా’ వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా సుధారాణి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. కాగా, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ పాల్గొనలేదు.


