న్యూస్రీల్
బుధవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2026
తాజా వివాదానికి కారణాలివే..
కాజీపేట–హైదరాబాద్ రైళ్లకు వేగం!
కాజీపేట నుంచి కాచిగూడ వైపు వెళ్లే పలు సుదూర ఎక్స్ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ శాశ్వతంగా కొత్త మార్గాన్ని అమలు చేసింది.
కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంపై ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసమావేశంలో ఉమ్మడి వరంగల్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర మాస్టర్ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లా వ్యవహారాల్లో ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రిని పక్కనబెట్టి కడియం శ్రీహరి అధికారులతో సమీక్షలు నిర్వహించడం, ఆదేశాలివ్వడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే కడియం శ్రీహరి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాసినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం, ప్రభుత్వ పరి పాలనలో అనవసర జోక్యం చేసుకోవడం వంటి అంశాలను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం.


