13 ఎకరాల్లో పంటసాగు.. | - | Sakshi
Sakshi News home page

13 ఎకరాల్లో పంటసాగు..

Sep 19 2026 12:52 AM | Updated on Sep 19 2026 12:52 AM

13 ఎకరాల్లో పంటసాగు.. ప్రభుత్వ ఆదేశాల మేరకే..

జూరాల కాల్వ నీరు సమృద్ధిగా వస్తుందనే ఆశతో ఈసారి 13 ఎకరాల్లో పంటసాగు చేస్తున్నా. వీటిలో 10 ఎకరాల్లో వరిపంట, 3 ఎకరాల్లో మినుము పంట వేశాను. ఇప్పటికే పంట పెట్టుబడితో పాటు కౌలు కోసం రూ. 3లక్షలు ఖర్చయ్యాయి. కాల్వకు సాగునీటిని నిలిపివేయడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. అధికారులు స్పందించి సాగునీరు విడుదల చేయాలి.

– కావలి రాజు, రైతు, మొట్లంపల్లి

ప్రస్తుతం జూరాలలో తాగునీటి అవసరాల మేరకు మాత్రమే నీరు అందుబాటులో ఉన్నాయి. ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోవడంతో కాల్వలకు సాగునీటిని వదలవద్దని పైనుంచి అధికారుల ఆదేశాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. – చంద్రశేఖర్‌, ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement