నేను 6 నుంచి 10వ తరగతి వరకు పెద్దమందడి టీజీడబ్ల్యూఆర్ఎస్/జేసీలో చదివాను. ఎస్సెస్సీలో 501 మార్కులతో పాసయ్యాను. అనంతరం ఇంటర్ ప్రవేశ పరీక్ష రాయగా.. నాకు మక్తల్లో సీటు కేటాయించారు. ఇక్కడ చదివిన వారికి ఇక్కడే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. అలా జరగలేదు. ఇక్కడ టీసీ ఇవ్వడంతో మక్తల్ టీజీడబ్ల్యూఆర్ఎస్/జేసీలో ఇంటర్ బైపీసీలో చేరాను. అక్కడ తాగునీరు పడక తరచుగా అనారోగ్యానికి గురవుతున్నా. చదువుకు ఇబ్బందిగా మారింది. మక్తల్ నుంచి పెద్దమందడి గురుకులానికి ట్రాన్స్పర్ చేసి.. నా చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలి.
– డి.పల్లవి, వెలగొండ, చిన్నంబావి మండలం


