చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అమలు కాని అనేక హామీలు ఇవ్వడంతో పాటు బీసీ సామాజిక వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకులా వాడుకుందని బీసీ నేతలు విమర్శించారు. మంగళగిరిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన’ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమ, దౌర్జన్న పాలనను ఎండగట్టారు. ఉత్తరాంధ్ర ప్రజలను మోసగించిన తీరును వివరించారు. కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ విక్రాంత్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. – సాక్షినెట్వర్క్


