ఉప్పొంగిన దేశభక్తి
జెండాయే స్ఫూర్తిగా తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. 150 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటారు. బస్టాండ్ వద్ద వృత్తాకారంలో జాతీయ జెండాను ప్రదర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్.ధనం, డీటీ సత్యనారాయణ, ఎంపీడీఓ కార్యాలయ ఏఓ వెంకటరమణ, ఎస్ఐ సాగర్బాబు, ఎంఈఓలు త్రినాథరావు, పాపారావు, హైస్కూల్ హెచ్ఎం రమేష్, వివిధ శాఖల మండలాధికారులు పాల్గొన్నారు. – తెర్లాం
తెర్లాంలో
150 అడుగుల జాతీయ
జెండాతో
విద్యార్థుల
తిరంగా ర్యాలీ


