మధ్యంతర భృతి చర్యలు లేకపోవడం దుర్మార్గం
మధ్యంతర భృతి కోసం ఉద్యోగులు,ఉపాధ్యాయులు,పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు.ఆ దిశగా చర్యలు లేకపోవడం దుర్మార్గం.ఎన్నికల్లో ఉద్యోగ,ఉపాధ్యాయుల అండతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం వారి సమస్యలను విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగ,ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఏ ఒక్కరూ ప్రభుత్వం తీరు పట్ల సంతోషంగా లేరు.తక్షణం స్పందించి ఐఆర్ ఇవ్వాలి.అలాగే సీపీఎస్,జీపీఎస్ విధానాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి.ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించేంతవరకూ పోరాడుతూనే ఉంటాం. – జేసీ రాజు,ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్


