ఉద్యమ బాట తప్పదు..
ఎన్నికల్లో చెప్పిన మేరకు ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు.డీఏ ఇచ్చేందుకు నిరాకరించడం, 12వ పీఆర్సీ నియమించకపోవడాన్ని బట్టి ఈ ప్రభుత్వానికి తమను పట్టించుకునే ఆలోచనేలేదని తేలిపోయింది. ఏటా జనవరి,జూలై మాసాల్లో ప్రతి ఆరు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం కరువు భత్యం ప్రకటిస్తోంది.దానిని అనుసరించి రాష్ట్రం డీఏలు ఇవ్వాల్సి ఉంది.కానీ కూటమి ప్రభుత్వం అలా ఇవ్వలేదు. ప్రభుత్వం ఉద్యోగ,ఉపాధ్యాయుల ఆర్ధిక బకాయిల సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్యలు తీసుకోలేదు.ఈ నెల 17వ తేదీన యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నాం. – ప్రసన్నకుమార్,
యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు


