
లక్ష్మీపేటకు అదనపు బందోబస్తు
వంగర: మండల పరిధి లక్ష్మీపేటకు అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు డీఎస్పీ ఎస్.రాఘవులు తెలిపారు. లక్ష్మీపేటలో శనివారం పర్యటించిన ఆయన ఆక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక న్యాయస్థానాన్ని పరిశీలించారు. 2012 జూన్ 12న జరిగిన ఘటన నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారన్నారు. అనంతరం వంగర పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట రూరల్ సీఐ హెచ్.
ఉపేంద్ర ఉన్నారు.
ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో ఆరోగ్యానికి ముప్పు
విజయనగరం: ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులను శాసీ్త్రయ పద్ధతుల్లో తొలగించడం ముఖ్య మని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానశాఖల ప్రత్యేక ప్రధా న కార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు. ఈ వ్యర్థా లను సరైన రీతిలో తొలగించకపోతే వాటి నుంచి వెలువడే రసాయనాలు పిల్లలు, గర్భిణులకు ప్రమాదకరంగా పరిణమిస్తాయని చె ప్పారు. విజయనగరం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇ–వ్యర్థాలపై నగరంలో పైడితల్లి అమ్మ వారి ఆలయం నుంచి కోట వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. కోట వద్ద విద్యార్థులు, మహిళలు స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఇ–వ్యర్థాలను శాసీ్త్రయంగా తొలగిస్తే వాటి నుంచి ఎంతో విలువైన బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలను వెలికితీయవచ్చన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోట వద్ద ఏర్పాటు చేసిన ఇ–వ్యర్ధాల సేకరణ కౌంటర్ను ప్రత్యేక అధికారి పరిశీలించారు. అనంతరం పైడితల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ అంబేడ్కర్, కమిషనర్ పి.నల్లనయ్య, ఆర్డీఓ కీర్తి, ఈఈ బి.బి.సరిత పాల్గొన్నారు.

లక్ష్మీపేటకు అదనపు బందోబస్తు