హత్యా..? ఆత్మహత్యా..? | - | Sakshi
Sakshi News home page

హత్యా..? ఆత్మహత్యా..?

Apr 18 2025 1:30 AM | Updated on Apr 18 2025 1:30 AM

హత్యా..? ఆత్మహత్యా..?

హత్యా..? ఆత్మహత్యా..?

పూసపాటిరేగ:

భోగాపురం మండలం రావాడ గొల్లపేట గ్రామంలో గురువారం అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఇప్పిలి అంకయ్యమ్మ (55), భర్త రమణ తరచూ రాజాపులోవలో ఉన్న ఎకరా ఢీ పట్టా భూమి విషయంపై గొడవ పడేవారు. డీ పట్టా అత్తపేరు మీద ఉండడంతో ఆ భూమిని విక్రయించేందుకు రమణ పలు మార్లు ప్రయత్నించాడు. దీనిని అంకయ్యమ్మ అడ్డుకుంది. ఈ విషయంపై ఇద్దరు కుమారులు, కుమార్తె సమక్షంలోనే భార్యాభర్తలు వాగ్వాదం చేసుకునేవారు. ఈ క్రమంలో అంకయ్యమ్మ మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె మృతికి భర్త రమణ, మృతురాలి బావ నర్సయ్య, కుమారుడు వెంకటేష్‌ కారణమని, ఆ సమయంలో ఈ ముగ్గు రూ ఇంట్లోనే ఉన్నారని బంధువులు చెబుతున్నారు. మరోవైపు ఆత్మహత్యకు పాల్పడిందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. భోగాపురం ఎస్‌ఐ సూర్యకళ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

ఆస్తి వివాదమే కారణమా?

కుటుంబ సభ్యులే హత్యచేశారంటూ

బంధువుల ఆరోపణ

దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement