నా మాటే శాసనం | - | Sakshi
Sakshi News home page

నా మాటే శాసనం

Jun 23 2024 1:34 AM | Updated on Jun 23 2024 9:24 AM

-

సచివాలయంలో టీడీపీ నేత పెత్తనం

ఉద్యోగి కుర్చీలో కూర్చుని అజమాయిషీ

విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజుల వ్యవధిలోనే టీడీపీ నేతల పెత్తనం మొదలైంది. విజయనగరం జిల్లా కేంద్రంలోని 41వ డివిజన్‌ పరిధిలోని 49వ సచివాలయానికి వెళ్లిన అధికార పార్టీ నాయకురాలు అనుఽరాధ బేగం నేరుగా సచివాలయ రెవెన్యూ కార్యదర్శి కుర్చీలో కూర్చుని అక్కడి ఉద్యోగులపై పెత్తనం చెలాయించడం చర్చనీయాంశంగా మారింది. 

గతంలో కానీ, ప్రస్తుతం కానీ ఎటువంటి పదవిలో లేని ఆమె ఉద్యోగి కుర్చీలో కూర్చుంటే సచివాలయ అడ్మిన్‌ కార్యదర్శి సందర్శకుల కుర్చీలో కూర్చున్నారు. అంతేకాకుండా స్థానిక టీడీపీ నాయకులను వెంట తీసుకువెళ్లి సచివాలయ ఉద్యోగులకు వారిని పరిచయం చేసి వారు చెప్పినట్లు నడుచుకోవాలంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. 

చివరిలో ఆమె సచివాలయ సిబ్బందితో గ్రూప్‌ ఫొటో దిగడం విశేషం. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడంతో ఎటువంటి పదవులు లేని వ్యక్తులు ఉద్యోగులపై అజమాయిషీ చెలాయించడం ఎంతవరకు సమంజసమంటూ చర్చించుకుంటున్నారు. ఈ విషయమై కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎం.మల్లయ్యనాయుడు దగ్గర ప్రస్తావించగా ఆ విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement