మహారాణిపేట: విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)కు చెందిన 459 ప్లాట్లను నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) ఆన్లైన్ వేలం ద్వారా విక్రయిస్తున్న నేపథ్యంలో, ఈ వేలంలో ప్లాట్లను దక్కించుకునే వారికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ సదుపాయం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి స్టీల్ప్లాంట్ బ్రాంచ్లో ప్రత్యేక ప్రచార బ్యానర్ను బ్యాంక్ అధికారులు ఆవిష్కరించారు. హెచ్బీ కాలనీ, మద్దిలపాలెం, ఆటోనగర్, గాజువాక ప్రాంతాల్లోని ఈ స్థలాలకు అక్టోబర్ 12, 16 తేదీల్లో ‘ఈ–నివిద’ ప్లాట్ఫామ్పై వేలం జరగనుందని వారు తెలిపారు. అత్యధిక ధరకు ప్లాట్లను దక్కించుకున్న అర్హులైన వ్యక్తులు, డెవలపర్లు, సంస్థలకు తమ అర్హత మేరకు అవసరమైన రుణ సదుపాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ స్థలాలు, రుణాలకు సంబంధించిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భువనేశ్వర్ జోన్ల పరిధిలోని పలు శాఖల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రుణ సదుపాయం అవసరమైన వారు బ్యాంక్ అధికారులు హేమంత్కుమార్ (7979848314) లేదా సురేష్ (9866363007)లను సంప్రదించవచ్చని సూచించారు.


