అల్లిపురం: రిజర్వ్ బ్యారెక్స్లో పబ్లిక్ అండ్ పోలీస్ అసోసియేషన్ ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాపాహోమ్కు రూ.4 లక్షల విరాళం అందించారు. దివంగత వంజరపు రామకృష్ణ జ్ఞాపకార్థం ఆయన కుటుంబం తరఫున వి.మోహనరావు ఈ విరాళాన్ని అందజేశారు. బాలుర పాపాహోమ్కు రూ.2 లక్షలు, సీతమ్మధారలోని బాలికల పాపాహోమ్కు రూ.2 లక్షల చొప్పున చెక్కులను పాపాహోమ్ అధ్యక్షుడు డి.సూర్యప్రకాశరావు, కోశాధికారి రమేష్చంద్ జైన్లకు ఇచ్చారు. ఈ సందర్భంగా పాపాహోమ్ కమిటీ సభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. బాలబాలికల సంక్షేమం, విద్య, సంరక్షణకు దాతల సహకారం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు భాస్కర్, శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


