గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు 42 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు.. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, నేటి మంత్రులు, ఎమ్మెల్యేలు మా దీక్షా శిబిరాలకు వచ్చారు. ‘మీ డిమాండ్లు న్యాయమైనవి, గట్టిగా పోరాడండి.. మా ప్రభుత్వం రాగానే జీతాలు పెంచుతామని’ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా ఆ ఊసే ఎత్తకపోవడం దుర్మార్గం. – ఆర్.కె.ఎస్.వి.కుమార్,
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి


