ఆహార నాణ్యతకు ‘క్షీ’ టీమ్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఆహార నాణ్యతకు ‘క్షీ’ టీమ్స్‌

Aug 21 2025 6:34 AM | Updated on Aug 21 2025 6:34 AM

ఆహార నాణ్యతకు ‘క్షీ’ టీమ్స్‌

ఆహార నాణ్యతకు ‘క్షీ’ టీమ్స్‌

డాబాగార్డెన్స్‌ : నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం జీవీఎంసీ (గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌) ‘క్షీ’ (శానిటేషన్‌ అండ్‌ హెల్త్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌) పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు నగరంలోని అన్ని జోన్‌లలో ‘ఈట్‌ రైట్‌ క్యాంపెయిన్‌’ ద్వారా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు. నగరంలోని ప్రతి జోన్‌లో రెండు చొప్పున మొత్తం 16 ‘క్షీ’ బృందాలు పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ బృందాలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, వీధి వ్యాపారుల వద్ద ఆహార నాణ్యత, పరిశుభ్రత, నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగంపై నిఘా ఉంచుతాయి. ఇప్పటివరకు 8 జోన్‌లలో 76 చోట్ల తనిఖీలు నిర్వహించి, 71 ఆహార విక్రయ కేంద్రాలకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే 50 చోట్ల నుంచి రూ.68,600 అపరాధ రుసుం వసూలు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement