
తల్లిదండ్రులకు చిన్నారుల అప్పగింత
కొమ్మాది: పీఎంపాలేనికి చెందిన ఐదుగురు చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పకుండా ఆదివారం రుషికొండ బీచ్కు వచ్చారు. వర్షం పడుతున్నప్పటికీ ఐదుగురు చిన్నారులు ఆ ప్రాంతంలో తిరుగుతుండటం చూసి మైరెన్ పోలీసులు వారిని ప్రశ్నించారు. తాము పీఎంపాలెం నుంచి తల్లిదండ్రులకు చెప్పకుండా ఇక్కడకు వచ్చామని కె.హర్షిన్, ఎ.హశ్వంత్, పి.కల్యాణి, ఎ.హర్షిత, ఎ.వంశీ తెలిపారు. వెంటనే పోలీసులు వారి నుంచి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని.. వారికి సమాచారం అందించారు. రుషికొండకు చేరుకున్న తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలను సురక్షితంగా అప్పగించారు.