కలెక్టరేట్‌లో ఘనంగా మొల్లమాంబ జయంతి | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో ఘనంగా మొల్లమాంబ జయంతి

Mar 14 2025 12:46 AM | Updated on Mar 14 2025 12:46 AM

కలెక్టరేట్‌లో ఘనంగా మొల్లమాంబ జయంతి

కలెక్టరేట్‌లో ఘనంగా మొల్లమాంబ జయంతి

మహారాణిపేట: కవయిత్రి, మొల్ల రామాయణం రచయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు గురువారం కలెక్టరేట్‌లో జరిగాయి. కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె జీవిత విశేషాలను గుర్తు చేసుకున్నారు. మొల్ల రచనా శైలి సరళమైనదని, ఆమె జీవితం అనుసరణీయమైనదని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్వో బీహెచ్‌ భవానీ శంకర్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి బి.శ్రీదేవి, కుమ్మరి శాలివాహన సంఘం డైరెక్టర్‌ చిరంజీవులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement