
కిశోర్ను అదుపులోకి తీసుకుని ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్కు తరలిస్తున్న పోలీసులు
గోపాలపట్నం: హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో మంగళవారం విశాఖ వచ్చిన టీడీపీ కార్యకర్త ఆడారి కిశోర్కుమార్ ఎయిర్పోర్టు వద్ద హల్చల్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తున్నట్లు ఫ్లకార్డులు ప్రదర్శించాడు. విమానంలో కూడా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ హడావిడి చేశాడు.
విమానం దిగి బయటకు వచ్చిన ప్రయాణికులు కిశోర్ తీరుతో ఇబ్బందులు పడ్డారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ వచ్చే సమయం కావడంతో ఆయన కాన్వాయ్ ముందు ఫ్లకార్డు ప్రదర్శించేందుకు అతను యత్నించాడు. దీంతో ఎయిర్పోర్టు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.