గణేశ్‌ ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు

Sep 8 2026 7:21 AM | Updated on Sep 8 2026 7:21 AM

అనంతగిరి: ప్రజల సహకారంతో గణేశ్‌ ఉత్సవాలను విజయవంతం చేస్తామని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. సోమవారం నగరం నుంచి డీజీపీ సీవీ ఆనంద్‌ అన్ని జిల్లాల పోలీస్‌ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గణేశ్‌ ఉత్సవాల ఏర్పాట్లు, బందోబస్తు తదితర వాటిపై సూచనలు చేశారు. అనంతరం వికారాబాద్‌లోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ స్నేహ మెహ్ర, ఏఎస్పీ రాజేష్‌ మీనాతో కలిసి మాట్లాడారు. ఉత్సవాలు, నిమజ్జనం వేడుక ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండపాలను క్రమం తప్పకుండా సందర్శించి భద్రతను పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. నిమజ్జన రూట్లను ముందుగానే చెక్‌ చేసి ట్రాఫిక్‌ నియంత్రణ, బారికేట్ల ఏర్పాట్లు, పార్కింగ్‌ తదితర వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎస్పీ స్నేహ మెహ్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement