పూడూరు: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బాకాపూర్లో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సొంత ఇల్లు లేనివారు ఉండకూడదన్నదే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆశయమన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల రఘునాథ్రెడ్డి, వైస్ చైర్మన్ సురేందర్ ముదిరాజ్, నాయకులు శ్రీనివాస్, తిర్మలయ్యగౌడ్, ముక్కంటి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతో ప్రశాంతత
దోమ: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఉదన్రావుపల్లిలో ధ్వజ స్తంభం, నాగశిల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శివకుమార్, మండల నాయకులు పాల్గొన్నారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి


