ఉపాధ్యాయుల కొరత తీర్చండి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల కొరత తీర్చండి

Aug 6 2026 8:08 AM | Updated on Aug 6 2026 8:08 AM

సంగెంకలాన్‌ సర్పంచ్‌ మీనాక్షి

పాఠశాల ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళన

తాండూరు రూరల్‌: మండలంలోని సంగెంకలాన్‌ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆ గ్రామ సర్పంచ్‌ మీనాక్షి డిమాండ్‌ చేశారు. బుధవారం పాఠశాల ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వంద మందికి పైగా విద్యార్థులు ఉన్నారని, హెచ్‌ఎంతో కలిపి నలుగురు ఉపాధ్యాయులే ఉన్నారన్నారు. ఇందులో ఓ టీచర్‌ ప్రసూతి సెలవుల్లో వెళ్లిందన్నారు. మరో టీచర్‌ నాగలక్ష్మిని డిప్యూటేషన్‌పై దోమ మండలానికి వేశారని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులతో ఏడు తరగతులు నిర్వహించడం చాలా కష్టంగా ఉందన్నారు. ఇంగ్లిష్‌, గణిత సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక పాఠాలు సాగడం లేదన్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, పరికప్ప, శ్రీకాంత్‌రెడ్డి, జగదీష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement