● విద్యార్థులంతా కష్టపడి చదవాలి
● పల్లవి డీఈడీ కాలేజీ కరస్పాండెంట్ కొప్పుల అనిల్రెడ్డి
పరిగి: తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని పల్లవి డీఈడీ కళాశాల కరస్పాండెంట్ కొప్పుల అనిల్రెడ్డి విద్యార్థులకు సూచించారు. బుధవారం పట్టణ కేంద్రంలోని కాలేజీలో ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశం, బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. మంచి ఉద్యోగాలను సాధించి తల్లిదండ్రులకు, కళాశాలకు పేరుప్రతిష్టలు తీసుకురావాలన్నారు. విద్యతో ఏదైనా సాధ్యమనే విషయాన్ని గుర్తించి, కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.


