● ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు
భద్రత పునరుద్ధరించాలి
● బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి
విజయ్ ఆర్యక్షత్రియ
పరిగి: రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేయడం సరికాదని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ ఆర్యక్షత్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు భద్రత కుందింపునకు నిరసనగా మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు భద్రత కుదింపు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కక్షపూరితంగానే ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నక్సల్స్, టెర్రరిస్టుల నుంచి ప్రమాదం ఉన్నందునే గత ప్రభుత్వాలు బుల్లెట్ ఫ్రూప్ వాహనం, భద్రతా సిబ్బందిని కల్పించాయని సర్కార్కు గుర్తుచేశారు. వెంటనే భద్రత పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, సురేందర్, పట్టణ అధ్యక్షుడు అంజయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుందఅశోక్కుమార్, జాక్ రవి, కృష్ణ, రవికుమార్, ఆంజనేయులు, ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


