కేశంపేట: గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర కోశాధికారిగా మండల కేంద్రానికి చెందిన ఆదిరాల రాంచంద్రయ్య ఎంపికయ్యారు. గత నెల 26న ఖమ్మం జిల్లా రఘనాథపాలెంలో పంచాయతీ వర్కర్స్ సంఘం రాష్ట్రస్థాయి 3వ మహాసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో సంఘం రాష్ట్ర కోశాధికారిగా కేశంపేట పంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్న రాంచంద్రయ్యను ఎంపిక చేస్తూ తీర్మానం చేశారు. రాష్ట్ర కమిటీ నుంచి రాంచంద్రయ్య సోమవారం నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.


