
పొలంలో నీరు ఉండొద్దు
ధారూరు: మండల కేంద్రంలో నీట మునిగిన పత్తి పంటను జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం పరిశీలించారు. మంగళవారం ధారూరు రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అధిక వర్షాలు కరుస్తునందున పంట పొలాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. కాల్వలు తీసి నీటిని బయటకు పంపాలని సూచించారు. వేరుకుళ్లు తెగు లు రాకుండా కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాముల ముందును లీటరు నీటిలో కలిపి మొక్క మొదళ్ల వద్ద పోయాలన్నారు. ప్రస్తుతం కంది పంట కొమ్మలు ఏర్పడే దశలో ఉందని, వేరుకుళ్లు తెగులు నివారణకు 2 గ్రాముల మెటలాగ్జిన్ను లీటరు నీటిలో కలిపి మొదళ్లు తడిసెలా పోయాలన్నారు. నానో యూరియా వాడాలని రైతులకు సూచించారు.