
ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం
తాండూరు టౌన్: తాండూరు ఫొటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈమేరకు స్థానిక వినాయక్ చౌక్లో ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఒక ఫొటో అనేక పాత, మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుందని తెలిపారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు షాబుద్దీన్, హీరాలాల్, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.