రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలి

Apr 29 2025 9:53 AM | Updated on Apr 29 2025 10:09 AM

రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలి

రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలి

అనంతగిరి: ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని కాంగ్రెస్‌ పార్టీ వికారాబాద్‌ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఈమేరకు సోమవారం గోధుమగూడ గ్రామంలో జై బాపు, జైభీమ్‌, జై సంవిధాన్‌ కార్యక్రమం చేపట్టారు. వీధుల గుండా ర్యాలీ నిర్వహించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఎంతో దూరదృష్టితో రాజ్యాంగాన్ని రచించారన్నారు. కాగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఈ ఆగడాలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు గ్రామగ్రామన రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు తుకారం, మల్లేశం, శివయ్య, జనార్దన్‌రెడ్డి, రమేశ్‌నాయక్‌, మనోహర్‌గౌడ్‌, రవీందర్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు

రాజశేఖర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement