– 8లో
– 8లో
హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు పడిన ఘటన నాయుడుపేట మండల పరిధిలో చోటు చేసుకుంది.
రుయా కూడలి వద్ద ఫుట్పాత్ ఆక్రమణతో రోగుల అవస్థలు
రద్దీ ప్రాంతాలే టార్గెట్
నడవడానికి వీలు లేకుండా, వాహనాలతో నిత్యం రద్దీగా, ట్రాఫిక్ చక్ర బంధాన్ని తలపించే ప్రాంతాల్లో ఎప్పుడూ లేనివిధంగా నగరంలో అక్రమ దుకాణాలు పుట్టుకొచ్చాయి. రైల్వేస్టేషన్ ముందు ఇసుకేస్తే రాలనంత జనాలు ఉంటారు. మోడ్రన్గా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్కు ఎదురుగా చిల్లర కొట్లు, తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటివల్ల యాత్రికులకు తీవ్ర అసౌకర్యం కాగా వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. అలానే రైల్వే స్టేషన్ ముందు విష్ణునివాసం ఫుట్పాత్ పూర్తిగా ఆక్రమణకు గురైంది. బస్టాండు, విష్ణు నివాసం పరిసర ప్రాంతాలు పూర్తిగా అక్రమ దుకాణాలకు కేరాఫ్గా నిలిచాయి. కపిల తీర్థం ఏరియా, అలిపిరి, రుయా పరిసర ప్రాంతాలు, ఎస్వీ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, ఏఐఆర్ బైపాస్ రోడ్డు, రేణిగుంట రోడ్డు, లక్ష్మీపురం కూడలి రోడ్ల ఫుట్ పాత్లు పూర్తిగా అక్రమణకు గురయ్యాయి. రోడ్ల అక్రమణతో యాత్రికులు నడక యాతన అనుభవిస్తున్నారు. రుయా కూడలి నుంచి అలిపిరి మార్గం పూర్తిగా కబ్జా కోరుల చేతుల్లోకి వెళ్లిపోయింది.


